జనవరి 16, 2023
రాష్ట్రస్థాయి కథానికల పోటీః విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య
సాహిత్య సమాచారకలశం (వాట్సాప్) సౌజన్యంతో
విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య, విజయనగరం, శోభకృత్ వత్సర ఉగాది పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కథానికల పోటీ కొరకు కథానికలను ఆహ్వానిస్తున్నది. పోటీలో గెలుపొందిన విజేతను 22-03-2023 ఉగాదినాడు సంస్థ 38 వ వార్షికోత్సవ సభలో
2000/- నగదు పురస్కారంతో సత్కరిస్తారు.
నియమ, నిబంధనలు
1) కథానిక 4 పేజీలకు మించకుండా ఉండాలి. డిటిపి లో మాత్రమే ఉండాలి.
2) కథానిక తమ స్వంతమని, ఎక్కడా ప్రచురితం కాలేదని (అచ్చులో కానీ, ఇంటర్ నెట్ లో కాని) హామి పత్రం ఇవ్వాలి.
3) మీ పేరు హామీ పత్రంలో మాత్రమే ఉండాలి.
4) కథానిక pdf format లో vijayabhavana@gmail.com కు పంపవలెను.
5) ఇతర మార్గాలలో పంపినవి స్వీకరించబడవు.
6) విషయం / subject లో
‘ శోభకృత్ వత్సర ఉగాది కథానికల పోటీ’ అని పేర్కొనవలెను.
7) వినూత్నమైన కథాకథనాలతో గాఢమైన అనుభూతిని అందించే రచనలకు స్వాగతం.
8) రోటీన్ సామాజికాంశాల కంటే భిన్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
9) కథానిక చేరవలసిన ఆఖరి తేదీ : 28 ఫిబ్రవరీ 2023
నిర్వాహకులు :
విజయభావన సాహితీమిత్ర సమాఖ్య, విజయనగరం
చలవాణి: 📞 9833611383 .
vijayabhavana@gmail.com
స్పందించండి